Special Task Force: పిల్లల్లో కోవిడ్‌ చికిత్స విధానానికి 8 మందితో కూడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

Special Task Force: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్‌-19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రణ..

Special Task Force: పిల్లల్లో కోవిడ్‌ చికిత్స విధానానికి 8 మందితో కూడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

Updated on: May 29, 2021 | 11:51 AM

Special Task Force: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్‌-19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రణ కోసం ఒక స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ కు చైర్మన్‌గా ఏపీఎండీసీ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ఏపీ హెచ్‌ఎస్‌ఎస్‌పీ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఐఏఎస్‌ వ్యవహరించనున్నారు.

కమిటీలో సభ్యులుగా డాక్టర్‌ రాఘవేంద్రరావు, సాయిలక్ష్మి, అరుణ్‌బాబు, సర్దారా సుల్తానా, చంద్రశేఖర్‌ రెడ్డి, రఘువంశి చిత్ర ఉన్నారు. అయితే పిల్లల్లో కరోనా లక్షణాలు ఉన్నప్పుడు వైద్య విధానాలు, ఇందుకు వైద్య సిబ్బంది, నర్సింగ్‌, పారా మెడికల్‌ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ వంటివి టాస్క్‌ ఫోర్స్‌ రూపొందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపు, నిబంధనల పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఎక్స్‌అఫిషియో చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి ఉంటారు.

ఇవీ కూడా చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. నేడు తుది నివేదిక: ఆయుష్‌ కమిషనర్‌ రాములు

సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం.. కోవిడ్‌తో వ్యక్తి మృతి.. 3 రోజులకు రూ.9 లక్షల బిల్లు.. కుటుంబీకుల ఆందోళన