Andhra Weaher: ఏపీలో ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
దేశంలో రుతుపవనాలు సీజన్ అయితే ముగిసింది. కొద్ది రోజులుగా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో రుతుపవనాలు వైదొలిగినట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

నైరుతి బంగాళాఖాతంపై తూర్పు దిశగా ఉపరితల ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో 3 రోజులపాటు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————-
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :-
————–
గురువారం, శుక్రవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగ మంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది.
శనివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
కాగా ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ సారి అదనంగా నెల రోజులు రుతుపవనాలు కొనసాగాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది అక్టోబరు 15న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సారి రాయలసీమలో సాధారణం (236.4 మి.మీ) కంటే 46 శాతం ఎక్కువ వర్షపాతం పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
