AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Andhra News: అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..
Andhra Crime
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 28, 2025 | 2:56 PM

Share

జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత భార్యపై అతనకు అనుమానం మొద లైంది. అది శృతిమించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆఖరిగా ఆమెను అంత మొందించాడు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి(45)కి నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరు కొంతమూరు వచ్చేశారు. అతను వెల్డింగ్ పనిచేసు కుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు నిహంత్, ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు.

అయితే సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితంలోకి అనుమానం అనే భూతం ప్రవేశించింది. దీంతో గత కొన్ని రోజులుగా భార్యను భర్త మాణిక్యం అనుమానించడం స్టార్ట్ చేశాడు. ఈ అనుమానంతోనే తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఇక భర్త వేధింపులను భరించలేకపోయిన భార్య రాజానగరం పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను పెడుతున్న టార్చర్‌ గురించి ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి నుంచి మాణిక్యం ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

అయితే తాజాగా శనివారం రాత్రి ఇంటికొచ్చిన మాణిక్యం భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవ పెరగడంతో మాణిక్యం సమీపంలోని నాపరాయి తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో భార్య అక్కడికక్కడే పడిపోయింది. దాడి సమయంలో అక్కడే ఉన్న పిల్లలు వెంటనే పక్కవీధిలో ఉంటున్న అమ్మమ్మకు విషయం చెప్పారు. వాళ్లు వచ్చే సరికి ఉషారాణి అపస్మారస్థితిలో పడిపోవడం గమనించారు. వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?