
ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళ గంగకు భక్తులు వెళ్లి వచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి. దీనితో నీటి కుక్కల ఆటలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. నీటి కుక్కలు ముఖ్యంగా ఎగువన వర్షాలు పడినప్పుడు.. పాతాళ గంగ నీటి మట్టం పెరిగినప్పుడు లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గినా… శ్రీశైలం జలాశయం పరిసరాలలో చేపల కోసం.. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి.
ప్రతి సంవత్సరం శ్రీశైలం పాతాళగంగలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. అయితే నీటి కుక్కల సర్వ సాధారణంగా మనిషి కనిపించినా శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో నీటి కుక్కలు శ్రీశైలంలోని పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర టూరిజం శాఖ జెట్టుపై ఒక్కసారిగా ప్రత్యక్షమై కనిపించి.. యాత్రికులకు కనువిందు చేసాయి. ఇలా హఠాత్తుగా కనిపించిన నీటి కుక్కలను యాత్రికులు సైతం తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నీటి కుక్కలు పాతాళగంగకు వెళ్లే వారు.. వీటిని చూస్తూ ఆనందంతో.. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కేరింతలు కొట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..