Breaking: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్

| Edited By:

Jun 23, 2020 | 9:12 AM

కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా..? సోకుతుందో తెలీక అందరిలో ఆందోళన నెలకొంది.

Breaking: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
Follow us on

కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు..? ఎలా..? సోకుతుందో తెలీక అందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధుల్లోనూ రోజు రోజుకు కరోనా టెన్షన్ ఎక్కువవుతోంది. మొన్నటివరకు తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా ఏపీలో వైరస్ కలకలం మొదలైంది. విజయనగరం ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ట్రూ నాట్ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ సోకింది. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం ఆర్‌టిపిసిఆర్ టెస్ట్‌కి బ్లడ్ శాంపిల్స్ పంపారు. ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో కడుబండి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

అయితే ఎమ్మెల్యేకి కరోనా రావడంతో ఎస్ కోట వైసీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎంపీ రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేసిన కడుబండి పలువురు ఎమ్మెల్యేలను కలవగా.. ప్రైమరీ కాంటాక్ట్స్‌పై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ విషయంపై కడుబండి మాట్లాడుతూ.. ఈ నెల పదవ తేదీన అమెరికా నుంచి వచ్చానని.. మూడు వందల మందితో కలసి ప్రయాణించటం వల్ల తానే స్వయంగా టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. నాలుగుసార్లు నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు ట్రూ నాట్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ కోసం ఎదురుచూస్తున్నానని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.

Read This Story Also:  ఆన్‌లైన్‌లో ‘సేంద్రియ వ్యవసాయం’ శిక్షణ.. అప్లై చేసుకోండిలా