ఆన్లైన్లో ‘సేంద్రియ వ్యవసాయం’ శిక్షణ.. అప్లై చేసుకోండిలా
పర్యావరణ స్పృహ పెరిగి ఇప్పుడు అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది యువ రైతులు సేంద్రియ వ్యవసాయం నేర్చుకునేందుకు ఔత్సాహికాన్ని చూపుతున్నారు.
పర్యావరణ స్పృహ పెరిగి ఇప్పుడు అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది యువ రైతులు సేంద్రియ వ్యవసాయం నేర్చుకునేందుకు ఔత్సాహికాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలో వారి కోసం జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎం) ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్రామీణ రైతులు, మహిళా రైతులకు సేంద్రియ సేద్య పద్దతులపై ఆన్లైన్లో 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. జూలై మొదటి వారంలో ఈ శిక్షణ ఉండబోతోంది. ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్/ డిగ్రీ/ పీజీ పాసైన గ్రామీణ యువ రైతులు, యువ మహిళా రైతులు ఈ కోర్సు నేర్చుకునేందుకు అర్హులు. వయస్సుకు సంబంధించి నిబంధన లేనప్పటికీ.. గ్రామీణ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉండగా.. మరో 8 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలోని రైతులకు నాగపూర్లోని ప్రాంతీయ కార్యాలయం శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడి: rdrcof.ngp-agri@gov.in. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 07118 297 054. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormForTraining.pdf వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు.