ఆ ఇద్దరి పై విజయసాయి ట్వీట్ల వర్షం..

| Edited By: Pardhasaradhi Peri

Aug 03, 2019 | 2:08 PM

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అన్న క్యాంటీన్లను హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ..? అంటూ ట్వీట్ చేశారు. మూసేశారని టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా.. దోచుకునేందుకే మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారని ట్వీట్ చేశారు. అటు పోలవరంపై ఎందుకు […]

ఆ ఇద్దరి పై విజయసాయి ట్వీట్ల వర్షం..
Follow us on

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అన్న క్యాంటీన్లను హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ..? అంటూ ట్వీట్ చేశారు. మూసేశారని టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా.. దోచుకునేందుకే మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారని ట్వీట్ చేశారు. అటు పోలవరంపై ఎందుకు ఉలిక్కి పడుతున్నావంటూ టీడీపీ నేత దేవినేని ఉమ పై కూడా మరో ట్వీట్ చేశారు. పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమ ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమిషన్లు దండుకున్నారు కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.