ఆ మంత్రికి ‘ఇరిగేషన్’ స్పెలింగ్ కూడా రాదు: కేశినేని ఎద్దేవా

ఏపీ ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ అని స్పెలింగ్ రాయడం కూడ రాదని అనిల్ కుమార్‌ను ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పేదల ఇళ్లు మొత్తం మునిగిపోయాయి అని ఆయన అన్నారు. తారక రామానగర్‌లో ఇళ్లు ఎవరు కట్టమన్నారని మంత్రి అక్కడి ప్రజలను ప్రశ్నిస్తున్నారని.. తాను పుట్టకముందు నుంచే అక్కడ ఇళ్లు ఉన్నాయని తెలిపారు. వరద బాధితులను రక్షించడంతో ముందస్తు అప్రమత్తం లేకుండా కనీస చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని […]

ఆ మంత్రికి ‘ఇరిగేషన్’ స్పెలింగ్ కూడా రాదు: కేశినేని ఎద్దేవా

Updated on: Aug 18, 2019 | 11:58 AM

ఏపీ ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ అని స్పెలింగ్ రాయడం కూడ రాదని అనిల్ కుమార్‌ను ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పేదల ఇళ్లు మొత్తం మునిగిపోయాయి అని ఆయన అన్నారు. తారక రామానగర్‌లో ఇళ్లు ఎవరు కట్టమన్నారని మంత్రి అక్కడి ప్రజలను ప్రశ్నిస్తున్నారని.. తాను పుట్టకముందు నుంచే అక్కడ ఇళ్లు ఉన్నాయని తెలిపారు. వరద బాధితులను రక్షించడంతో ముందస్తు అప్రమత్తం లేకుండా కనీస చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us