అమరావతిలో కీచక పర్వం..

అమరావతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కీచక ఎస్సై భాగోతం బయటపడింది. పెదకూరపాడు మండలానిక చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు....

అమరావతిలో కీచక పర్వం..

Edited By:

Updated on: Jun 10, 2020 | 9:43 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కీచక ఎస్సై భాగోతం బయటపడింది. పెదకూరపాడు మండలానిక చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. అయితే విశ్రాంతి నెపంతో లాడ్జికి వచ్చిన స్థానిక ఎస్సై రామాంజనేయులు… వారిని గమనించి కేసు నమోదు చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. వదిలిపెట్టేందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయగా… వారు రూ. 5 వేలు ఇస్తామని చెప్పారు. అయితే తమ వద్ద ఉన్న రూ.3 వేలు ఇచ్చి మరో రూ. 2 వేల కోసం అక్కడికి సమీపంలో ఉన్న ఏటీఎంకు డ్రైవర్‌ను ఇచ్చి పంపించాడు ఎస్సై. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి తిరిగి అక్కడికి చేరుకునే వరకు ఎస్సై మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. మహిళ తరగబడటంతో వదిలిపెట్టాడు.  ఎవరికైనా విషయాన్ని చెబితే కేసు నమోదు చేస్తానంటూ హెచ్చరించాడు. వారి వివరాలు తీసుకుని విడిచిపెట్టాడు. అయితే బాధితులు మంగళవారం ఎస్సై రామాంజనేయులపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ మొదలు పెట్టారు. ఎస్సైతోపాటు అతనికి సహకరించిన డ్రైవర్‌పై కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us