సజ్జలకు కీలక పదవి?

|

Jun 15, 2019 | 7:50 PM

వైసీపీ 9 ఏళ్ల పాటు పోరాడి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని అంటి పెట్టికుని ఉన్నవాళ్లు, మద్దతుగా నిలిచిన వారికి సీఎం జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమిస్తున్నారు. తండ్రి తరహాలోనే ఆప్తులకు అండగా నిలుస్తూ తన ప్రత్యేకతనే చాటుకుంటున్నారు. పబ్లిక్ ఎఫైర్స్ విషయంలో ప్రభుత్వ సలహాదారుగా వైఎస్ హయాంలో కేవీపీ  రామచంద్రరావు వ్యవహరించగా ఇప్పుడు అచ్చం అదే హోదాతో సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ అవకాశం లభించినట్లు సమాచారం. మొదటి […]

సజ్జలకు కీలక పదవి?
Follow us on

వైసీపీ 9 ఏళ్ల పాటు పోరాడి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని అంటి పెట్టికుని ఉన్నవాళ్లు, మద్దతుగా నిలిచిన వారికి సీఎం జగన్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమిస్తున్నారు. తండ్రి తరహాలోనే ఆప్తులకు అండగా నిలుస్తూ తన ప్రత్యేకతనే చాటుకుంటున్నారు. పబ్లిక్ ఎఫైర్స్ విషయంలో ప్రభుత్వ సలహాదారుగా వైఎస్ హయాంలో కేవీపీ  రామచంద్రరావు వ్యవహరించగా ఇప్పుడు అచ్చం అదే హోదాతో సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ అవకాశం లభించినట్లు సమాచారం.

మొదటి నుంచి జగన్ వెంట నిలిచినందుకు సజ్జల రామకృష్ణా రెడ్డికి మంచి హోదా లభించిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించారు సజ్జల. జర్నలిస్టిక్ నేపథ్యం ఉన్న ఆయన సాక్షి ఆవిర్భావం దగ్గర నుంచి ఆ సంస్థ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆ సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు. అటు టెలివిజన్ కు ఇటు పత్రికకు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈడీగా వ్యవహరించి.. ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మీడియా ద్వారా పార్టీ  వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వేర్వేరు జిల్లాలకు ఇన్‌చార్జిగా కూడా వ్యవహరించిన సజ్జల… కొన్ని జిల్లాల అభ్యర్థుల ఎంపికలో కూడా జగన్‌కు కీలక సలహాలు ఇచ్చారు. ఇలా పార్టీ విజయంలో తనవంతు పాత్రను పోషించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.