నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. రాజధానిలోని 29గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగష్టు ఒకటో తేది నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గజం ధర రూ.1000 ఉండగా.. రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5వేల వరకు పెరిగాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున రూ.200 నుంచి రూ.2వేలకు మించి పెంపుదల లేదు.