రేపు పులివెందులకు సీఎం.. పర్యటన సాగనుందిలా

| Edited By: Pardhasaradhi Peri

Aug 07, 2019 | 11:10 AM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. ఈ గురువారం ఆయన పులివెందులకు వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.35గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని 9.40గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.10గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 10.35గంటలకు భాకరాపురం చేరుకొని.. అక్కడ మాజీ మంత్రి వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తరువాత 11.10గంటలకు పులివెందు ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.00గంటకు […]

రేపు పులివెందులకు సీఎం.. పర్యటన సాగనుందిలా
Follow us on

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. ఈ గురువారం ఆయన పులివెందులకు వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.35గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని 9.40గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.10గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 10.35గంటలకు భాకరాపురం చేరుకొని.. అక్కడ మాజీ మంత్రి వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తరువాత 11.10గంటలకు పులివెందు ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.00గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్లనున్నారు.