
అసలు అమరావతికి చట్టబద్ధత ఎందుకు? వైసీపీ అడుగుతున్నది ఇదే. సామాన్యుడి ప్రశ్న కూడా. ఇందుకోసం.. పార్లమెంట్లో ఏకంగా చట్ట సవరణ చేయాల్సిన అవసరమేంటి అనేది కూడా మెదళ్లలో నానుతున్న ప్రశ్నే. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఒక ‘కొత్త రాజధాని’ ఉండాలి అని.. 2014 విభజన చట్టంలో రాసి ఉంది. అందులో ‘అమరావతి’ అనే పేరు లేదు. సో, ఆ పునర్విభజన చట్టంలో ఖాళీగా ఉన్న ఆ చోటును ‘అమరావతి’ అనే పేరుతో భర్తీ చేశారు. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధ చిరునామా దొరికింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3&4 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. 2014 విభజన చట్టం ఈ ఆర్టికల్స్ కిందనే రూపొందించారు. ఆ తరువాత వచ్చే.. సెక్షన్-5ని సవరించడం ద్వారా, అమరావతిని రాజధానిగా గుర్తించే అంశం నేరుగా పార్లమెంటరీ చట్టం పరిధిలోకి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీలు భవిష్యత్తులో చేసే తీర్మానాల కంటే ఈ కేంద్ర చట్టానికే ఎక్కువ విలువ ఉంటుంది. గతంలో ‘మూడు రాజధానుల’ వ్యవహారం హైకోర్టులో ఉన్నప్పుడు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడ...