Andhra Pradesh: గంగవరం పోర్ట్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. కార్మిక సంఘాల బంద్కు రాజకీయ పార్టీల మద్దతు..
Gangavaram Port Bandh: విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ బంద్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గంగవరం పోర్ట్ మెయిన్ గేటుకు 100 మీటర్ల దూరంలో అదనంగా భారీ గేటు ఏర్పాటు చేసి.. ఇరువైపులా భారీ ఇనుప కంచే ఏర్పాటు చేశారు. తమకు వేతనాల పెంచాలని..
Gangavaram Port Bandh: విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ బంద్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గంగవరం పోర్ట్ మెయిన్ గేటుకు 100 మీటర్ల దూరంలో అదనంగా భారీ గేటు ఏర్పాటు చేసి.. ఇరువైపులా భారీ ఇనుప కంచే ఏర్పాటు చేశారు. తమకు వేతనాల పెంచాలని, యాజమాన్యం వేధింపులు ఆపాలని 45 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పోర్ట్ బంద్కు పిలుపునిచ్చాయి అఖిలపక్ష కార్మిక సంఘాలు.దీంతో విశాఖ గంగవరం పోర్ట్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు ఇనుప కంచెను దాటుకుని వెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. వేతనాలు పెంచాలి, వేధింపులు ఆపాలంటూ కార్మికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారురు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంగవరం పోర్ట్ బంద్కు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

