తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.? ఈ వార్త చదివేయండి..

| Edited By: Ravi Kiran

Apr 16, 2024 | 12:30 PM

తిరుమల శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. జూలై నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు రిలీజ్ చేయనుంది.

తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.? ఈ వార్త చదివేయండి..
Tirumala Tirupati
Follow us on

తిరుమల శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. జూలై నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు రిలీజ్ చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు కానుండగా.. టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ 22న వర్చువల్ సేవల కోటా టికెట్లను విడుదల చేస్తుంది. టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు జారీ చేయనుంది.

జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. జూలై నెల‌ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిలో గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది. అదే రోజు న‌వ‌నీత సేవ కోటా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ కోటా మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి భక్తులు ఈ మేరకు టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుతోంది.