Andhra Pradesh: దేశంలోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహలను ప్రతిటిష్టించాలని జరుగుతున్న ప్రయత్నం నెమ్మదిగా కార్యాచరణలోకి వస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో..

Andhra Pradesh: దేశంలోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన భక్తజనం..
Lord Ganesh Kurnool
Follow us

|

Updated on: Sep 10, 2022 | 9:22 PM

Andhra Pradesh: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహలను ప్రతిటిష్టించాలని జరుగుతున్న ప్రయత్నం నెమ్మదిగా కార్యాచరణలోకి వస్తుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా రంగులు నీటిలో కాలుసి, నీరు కలుషితం అయ్యేది. దీంతో మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా ఓ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మొత్తం మీద నెమ్మదిగా భారీ ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే మట్టివిగ్రహాలను కూడా భారీ స్థాయిలో పెట్టాలనే ఆలోచనతో మట్టితో ఎత్తైన విగ్రహాలను తయారుచేయించి ఈఏడాది చాలా చోట్ల ప్రతిష్టించారు. దీనిలో భాగంగా కర్నూలులో దేశంలోనే రెండవ అతిపెద్ద మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఈరోజు దేశంలోనే రెండవ అతిపెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం జరిగింది. కర్నూలులో తుంగభద్ర నది వద్దన జరిగిన ఈకార్యక్రమానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఈవిగ్రహం ఎత్తు 55 అడుగులు. ఈ భారీ మట్టి వినాయకుడిని వేలాదిమంది భక్తులు నిమజ్జనం చేశారు. వాస్తవంగా ఈనెల 8న కర్నూలులో వినాయక నిమజ్జనం జరిగింది. అయితే 55 అడుగుల భారీ మట్టి వినాయకుడిని సెప్టెంబర్ 10వ తేదీ శనివారం నిమజ్జనం చేశారు.

రెండు నెలలపాటు బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు తుంగభద్రా నది ఒడ్డున ఈవిగ్రహన్ని తయారు చేశారు. ఆతర్వాత అక్కడే ప్రతిష్టించారు. ప్రతిష్టించిన చోటనే ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని కొట్టి మట్టి వినాయకుడు కరిగిపోయేలా చేసి నిమజ్జనం చేశారు. తుంగభద్రా నది పక్కనే ఉండటంతో నీరు మట్టి అంతా నదిలో కలిసిపోయింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు నగరవాసులు వేలాదిగా తరలివచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, బిజెపి నేత హరీష్ బాబు, జనసేన నేత రేఖ గౌడ్ తదితర నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొని నిమజ్జనం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం