ట్రంప్, జో బైడెన్ ల ప్రసంగాలకు ‘మ్యూట్ బటన్ తో ‘ కళ్లెం !

| Edited By: Anil kumar poka

Oct 20, 2020 | 10:51 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బైడెన్ మధ్య గురువారం ముఖాముఖి డిబేట్ జరగనుంది.  గతంలో వీళ్ళ ప్రసంగాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా మారడంతో..

ట్రంప్, జో బైడెన్ ల ప్రసంగాలకు మ్యూట్ బటన్ తో  కళ్లెం !
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బైడెన్ మధ్య గురువారం ముఖాముఖి డిబేట్ జరగనుంది.  గతంలో వీళ్ళ ప్రసంగాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా మారడంతో ఈ  సారి ప్రెసిడెన్షియల్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పదిహేను నిముషాలకొకసారి ఒకరు మాట్లాడాక మైక్రోఫోన్ లను సైలెన్స్ అంటే మ్యూట్ చేస్తారు. రెండు నిముషాల పాటు అది ఆలా సైలెన్స్ మోడ్ లో ఉంటుంది. గత నెల 29 న జరిగిన డిబేట్ లో ట్రంప్ మాటిమాటికీ ట్రంప్..బైడెన్ స్పీచ్ కి అడ్డుతగులుతూ వచ్చారు.