Pakistan: అదో ఉగ్రలోకం.. డమ్మీలుగా పాక్‌ ప్రధానులు.. శాసించేదంతా సైన్యాధిపతులు..!

ఉగ్రవాదం దారిద్ర్యం వల్లే పుట్టుకొస్తుంది అనుకుంటాం. దశాబ్దాలుగా ప్రపంచం అంతా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పాకిస్తాన్‌లో స్వయంగా సర్వే చేశాక గానీ అసలు విషయం బోధపడలేదు. ఉగ్రవాదానికి, పేదరికానికి అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఓ మాట అంటుంటారు.

Pakistan: అదో ఉగ్రలోకం.. డమ్మీలుగా పాక్‌ ప్రధానులు.. శాసించేదంతా సైన్యాధిపతులు..!
Pakistan Terrorism

Updated on: May 26, 2025 | 10:08 PM

ఉగ్రవాదం దారిద్ర్యం వల్లే పుట్టుకొస్తుంది అనుకుంటాం. దశాబ్దాలుగా ప్రపంచం అంతా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పాకిస్తాన్‌లో స్వయంగా సర్వే చేశాక గానీ అసలు విషయం బోధపడలేదు. ఉగ్రవాదానికి, పేదరికానికి అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఓ మాట అంటుంటారు. పాకిస్తాన్, ఉగ్రవాదం కవలలు అని. మరీ ముఖ్యంగా పాక్ ఆర్మీ, టెర్రరిజం ట్విన్స్. దీనికి కారణం.. అక్కడి రాజకీయ అస్థిరత. ఆ అస్థిరతకు కారణం ఆర్మీ. ఆర్మీకి రాజకీయాలతో ఏం పని అని అడిగితే.. భారత్‌ అనే సమాధానం వస్తుంది. భారత్‌పై ద్వేషాన్ని పెంచుకుని పాకిస్తాన్‌ ఎంతగా దిగజారిపోయిందంటే.. ఆ డిటైల్స్‌ ఈ స్టోరీలో చూద్దాం. విజ్ఞత అని ఓ ఐటమ్‌ ఉంటుంది. పాకిస్తాన్‌ పాలకుల్లో లోపించిందల్లా అదే. దేశ విభజన తరువాత.. అటు పాకిస్తాన్‌లో ఇటు భారత్‌లో ఒకేసారి ప్రభుత్వాలు ఏర్పడ్డాయ్. భారత్‌.. దేశం కోసం ఆలోచిస్తే.. పాక్‌ పాలకులు మాత్రం దోచుకోవడంపై దృష్టి పెట్టారు. మరోవైపు.. తమది కాని కశ్మీర్‌ కోసం కొట్లాట. ఈ పరిస్థితి కారణంగానే.. పాక్‌ ఆర్మీ అక్కడి రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి జనాన్ని ఉద్దరిద్దామని కాదు పాక్‌ ఆర్మీ పాలిటిక్స్‌లోకి చొరబడింది. కేవలం.. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే దురాలోచనతోనే. సో.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కశ్మీర్‌ గురించే మాట్లాడుతుంటుంది. పాక్‌ ప్రధానులైనా సరే.. కశ్మీర్‌ గురించే మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే.. ప్రధానమంత్రిని ఆర్మీనే కుర్చీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి