శ్రీలంక పేలుళ్లు: ఉన్నతాధికారులపై వేటు

శ్రీలంకలో జరిగిన అతి భయంకర మారణహోమం నేపథ్యంలో ఆ దేశ రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. పేలుళ్ల గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. వాటిని నివారించడంలో వారిద్దరు విఫలమైనందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సిరిసేన సలహాదారు షిరల్ లక్‌తిలక ధ్రువీకరించారు. కాగా వరుస పేలుళ్ల తరువాత మంగళవారం సిరిసేన మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి […]

శ్రీలంక పేలుళ్లు: ఉన్నతాధికారులపై వేటు

Updated on: Apr 25, 2019 | 1:03 PM

శ్రీలంకలో జరిగిన అతి భయంకర మారణహోమం నేపథ్యంలో ఆ దేశ రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. పేలుళ్ల గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. వాటిని నివారించడంలో వారిద్దరు విఫలమైనందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సిరిసేన సలహాదారు షిరల్ లక్‌తిలక ధ్రువీకరించారు.

కాగా వరుస పేలుళ్ల తరువాత మంగళవారం సిరిసేన మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నిఘా వర్గాల సమాచారం ఉన్నప్పటికీ.. రక్షణ అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో 24గంటల్లో రక్షణ విభాగంలోని ఉన్నత పదవుల్లో మార్పులు ఉంటాయని తెలిపిన ఆయన.. రక్షణ కార్యదర్శి, ఐజీలపై వేటు వేశారు. కాగా శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఐజీని విధుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉండదు.

Loading...
Unable to load recommendations.
Follow Us