
పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి కమర్ జావేద్ బాజ్వా తీవ్రమైన తల గాయాలతో మరణించారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మీడియా కథనాల ప్రకారం, 65 ఏళ్ల మాజీ జనరల్ కమర్ జావేద్ తన బాత్రూమ్లో జారి పడిపోయాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఈరోజు అదివారం (మార్చి 29, 2026) తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, మాజీ సైన్యాధిపతి బావమరిది నయీమ్ ఘుమాన్, బాజ్వా చెప్పులు లేకుండా ఉన్నారని తెలిపారు. ఆయన బాత్రూమ్లో జారిపడి తలకు గాయమైందని చెప్పారు. ఆ సమయంలో, వైద్య పరీక్షలో అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదని, అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. అప్పటి పరిస్థితిని వివరిస్తూ, పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి ఇప్పుడు 100 శాతం ప్రమాదం నుంచి బయటపడ్డారని ఘుమాన్ పేర్కొన్నారు. పడిపోయిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి, కుటుంబ వర్గాలు గతంలో ధృవీకరించాయి. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే వైద్యులు అతడికి పెద్ద శస్త్రచికిత్స చేశారు. అనంతరం అతడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.
ఆ సమయంలో, శస్త్రచికిత్స విజయవంతమైందని, అయితే రాబోయే రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా మెరుగుపడుతుందనే దానిపై ఆయన కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. గాయం తీవ్రత దృష్ట్యా, వైద్య బృందాలు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. బాజ్వా 2016 నుండి 2022 వరకు పాకిస్తాన్ సైన్యాధిపతిగా పనిచేశారు. 2019లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. 2022 చివరిలో పదవీ విరమణ చేసినప్పటి నుండి, కమర్ జావేద్ బాజ్వా చాలా వరకు ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..