ఇరాక్లో ఉగ్రదాడి… ఆరుగురు మృతి!
ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థలు కిర్కుక్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా వెంబడి […]
ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థలు కిర్కుక్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియా వెంబడి విస్తరించిన అతి పెద్ద ఉగ్రవాద సంస్థ. దేశంలో తరచూ దాడులకు పాల్పడుతూనే ఉంటుంది. ఐసిస్ ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఇరాక్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.