మసీదు సమీపంలో ఆగివున్న కారు.. అకస్మత్తుగా పేలిపోయి 8మంది మృత్యువాత.. 18 మందికి గాయాలు

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 3:08 PM

శుక్రవారం మసీదు సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. 18 మంది గాయపడ్డారు.

మసీదు సమీపంలో ఆగివున్న కారు.. అకస్మత్తుగా పేలిపోయి 8మంది మృత్యువాత.. 18 మందికి గాయాలు
Blast
Follow us on

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని మసీదు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. మీడియా నివేదికల ప్రకారం.. శుక్రవారం మసీదు సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. 18 మంది గాయపడ్డారు. తాలిబాన్ సీనియర్ అధికారి బాంబు దాడిని ధృవీకరించారు. కారులో ఉంచిన బాంబు పేలిందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు విరణ ఇచ్చారు.

కాబూల్ పోలీసు చీఫ్ కోసం తాలిబాన్ నియమించిన అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ప్రకారం.. పశ్చిమ కాబూల్‌లోని షియా-ఆధిపత్యం గల సార్-ఎ కరెజ్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. ప్రాథమిక బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే మరణించారు. అయితే కొంతమంది గాయపడిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కొల్పోపయారు. దాంతో మరణాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.18 మంది గాయపడినట్లు తేలింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

ఈ బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. మృతుల సంఖ్యను పోలీసులు 8గా పేర్కొంటున్నారు. అదే సమయంలో పేలుడులో 20 మంది మరణించినట్లు ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిలో, పేలుడు సంభవించిన తరువాత ప్రజలు సహాయం కోసం కేకలు వేయడం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌కు ఉగ్రవాద సంస్థ ఐఎస్ పెను ముప్పుగా మారుతోంది. ఈ సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు 2014 నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో చురుకుగా ఉన్నారు, వారు దేశ భద్రతకు ప్రధాన ముప్పుగా భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఈ సవాలు తీవ్రమైంది. ఈ రాడికల్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇటీవలి రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రధానంగా మైనారిటీ షియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని అనేక దాడుల వెనుక ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి