Bumper Jackpot: 20 ఏళ్ల క్రితం భర్త కలను నమ్మింది.. రాత్రికి రాత్రే రూ. 340 కోట్లకు అధిపతి అయ్యింది ఓ భార్య .. ఎలా అంటే..!

|

Feb 03, 2021 | 1:39 PM

మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు యువతని కలలు కనండి.. ఆ కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నారు.. అయితే ఇక్క ఓ భార్య భర్త కన్న కలలను నమ్మి కొన్ని కోట్లకు అధిపతి అయ్యింది. మరి ఏమిటా కల...

Bumper Jackpot: 20 ఏళ్ల క్రితం భర్త కలను నమ్మింది.. రాత్రికి రాత్రే రూ. 340 కోట్లకు అధిపతి అయ్యింది ఓ భార్య .. ఎలా అంటే..!
Follow us on

Bumper Jackpot: మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు యువతని కలలు కనండి.. ఆ కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నారు.. అయితే ఇక్క ఓ భార్య భర్త కన్న కలలను నమ్మి అవి నిజం అవుతాయంటూ ఎదురు చూసి చూసి ఇప్పుడు ఆ భార్య కొన్ని కోట్లకు అధిపతి అయ్యింది. మరి ఏమిటా కల.. అసలు భర్త కల కంటే భార్య కోటీశ్వరురాలు అవ్వడం ఏమిటి..? ఏమిటా వింత అనుకుంటున్నారా..! అసలు విషయం తెలుసుకోవాల్సిందే..

టొరంటో కి చెందిన డెంగ్ ప్రవతౌదమ్(57) ఇటీవలే అక్షరాలా 60 మిలియన్ డాలర్ల లోట్టో మ్యాక్స్ జాక్‌పాట్ ను గెలుచుకుంది. మన దేశ కరెన్సీ లో చెప్పాలంటే ఆమె లాటరీ ద్వారా గెలుచుకుంది అక్షరాలా రూ. 340 కోట్లు. ఇలా తాను ఇంత మొత్తంలో లాటరీ గెలుచుకోవడానికి డెంగ్ ప్రవతౌదమ్ ఓ రీజన్ కూడా చెప్పింది. ఆ రీజన్ వింటే ఎవరైనా షాక్ అవ్వడం ఖాయం..

తన భర్తకు 20 ఏళ్ల క్రితం కలలో కొన్ని లాటరీ సంఖ్యలు కనిపించాయని చెప్పింది. అప్పటి నుంచి ఆ లాటరీ నెంబర్స్ తో లాటరీ ఆడుతూ వస్తున్నట్లు చెప్పింది. అలా ఇప్పుడు అందులోని ఒక నెంబర్ కు ఇంత డబ్బును గెలుచుకున్నానని ఆనందం వ్యక్తం చేసింది డెంగ్.

నాకు కల రావడం ఏమిటో.. లాటరీ తాగడం ఏమిటో.. కోటీశ్వరుడిని అవ్వడం ఏమిటో అని ఎల్ బి శ్రీరామ్ఓ సినిమాలో అన్నట్లు ఇప్పుడు డెంగ్ భర్తకు 20 ఏళ్ల క్రితం కల రావడం.. ఆ కలలో లాటరీ నెంబర్స్ కనిపించడం ఇప్పుడు భార్య రూ.340 కోట్లు గెలవడం అంతా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన కదా..!

Also Read:

హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?

ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న ‘స్పేస్‌ఎక్స్’.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..