బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి

|

Aug 26, 2024 | 3:33 PM

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారని తెలిపారు

బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ఐడీ అడిగిమరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు, 23 మంది మృతి
Balochistan
Follow us on

పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముసాఖెల్ జిల్లాలో బహిరంగంగానే కొంత మంది సాయుధులు మృత్యువుతో ఆట ఆడారు. ఇక్కడ కొంతమంది సాయుధ వ్యక్తులు రోడ్డుమీద వెళ్తోన్న ట్రక్కులు, బస్సుల నుండి ప్రయాణికులను దింపారు. తర్వాత వారిని ఒకొక్కరిని పరిశీలించి ఆపై కొంత మంది మీద కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో కనీసం 23 మంది మరణించారని తెలుస్తోంది. పంజాబ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముసాఖేల్ సాయుధులు దాడి చేశారని పాకిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ తెలిపారు.

ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని 23 మంది ప్రయాణికులను బస్సులో నుంచి దించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.

ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

ఇవి కూడా చదవండి

సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించే పనిలో పడ్డారని తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి

దాదాపు నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి దాడి జరిగింది. అంతకుముందు ఏప్రిల్‌లో నోష్కీ సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సులో నుండి దింపి, వారి ఐడి కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు. ఏప్రిల్‌కు ముందు, గతేడాది అక్టోబర్‌లో బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలు హత్యకు గురయ్యారు. ఈ హత్యలన్నీ పంజాబ్‌ ప్రాంత వాసులే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారందరూ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఈ దాడులు హత్యలు వారి జాతి నేపథ్యం కారణంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇది కాకుండా 2015 సంవత్సరంలో సాయుధ వ్యక్తులు 20 మంది కార్మికులను హత్య చేశారు. అప్పుడు కూడా ఈ వ్యక్తులు కూడా పంజాబ్ వాసులే.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..