ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్.. కరోనా నేపథ్యంలో సీఈవో సుందర్ పిచాయ్ ఈ నిర్ణయం..

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన గూగుల్.. కరోనా నేపథ్యంలో సీఈవో సుందర్ పిచాయ్ ఈ నిర్ణయం..

Updated on: Dec 15, 2020 | 5:27 AM

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే కరోనా వల్ల గూగుల్ వర్క్ ఫ్రం హోం చేయిస్తోంది. తాజాగా దానిని పొడిగించింది.

ఉద్యోగులకు 2021 జూన్ వరకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన గూగుల్ తాజాగా దీనిని సెప్టెంబర్ వరకు పొడిగించింది. అంతేకాకుండా ఉద్యోగులకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్‌కి వస్తే చాలని మిగతా మూడు రోజులు వర్క్ ఫ్రం హోం చేయొచ్చని చెబుతోంది. దీనికి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపించారు. కరోనా వల్ల ఎంప్లాయిస్ కార్యాలయాలకు రావడానికి భయపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఐటీ కంపెనీలన్ని తిరిగి పుంజుకుంటాయి. యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us