Hydrogen Fuel Train: ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైలు.. ప్రయాణికుల కోసం సర్వం సిద్ధం.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Aug 30, 2022 | 6:06 PM

హైడ్రోజన్ ఇంధన సెల్ రైళ్లు 1,000 కి.మీల పరిధిని కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఒక హైడ్రోజన్ ట్యాంక్‌పై ఒక రోజు పాటు నడపడానికి వీలు కల్పిస్తాయి. ఈ రైళ్ల వల్ల 1.6 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది.

Hydrogen Fuel Train: ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైలు.. ప్రయాణికుల కోసం సర్వం సిద్ధం.. ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Hydrogen Fuel Train
Follow us on

Hydrogen Fuel Train: ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. మానవజాతి అభివృద్ధిలో ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రయాణికులు ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధన రైలులో ప్రయాణించనున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ రైలు నెట్‌వర్క్ జర్మనీలోని లోయర్ సాక్సోనీలో ప్రారంభించబడింది. నాలుగేళ్ల క్రితం దీని ట్రయల్స్‌ మొదలయ్యాయి. ఇప్పుడు జర్మనీలో డీజిల్ రైళ్ల స్థానంలో ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్స్టోమ్ తయారు చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రైవ్‌లతో కూడిన 14 రైళ్లు రానున్నాయి. కొత్త రైళ్లలో ఐదు ఇప్పటికే పనిచేస్తుండగా, మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి నడపబోతున్నాయి.

హైడ్రోజన్ ఇంధన సెల్ రైళ్లు 1,000 కి.మీల పరిధిని కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఒక హైడ్రోజన్ ట్యాంక్‌పై ఒక రోజు పాటు నడపడానికి వీలు కల్పిస్తాయి. ఈ రైళ్ల వల్ల 1.6 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది. దీనివల్ల ఏడాదికి 4,400 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల తగ్గుతుంది. రైలు గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం దాదాపు 93 మిలియన్ యూరోలు.1990 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 65 శాతం తగ్గించాలని జర్మనీ లక్ష్యంగా పెట్టుకుంది.