Guidelines For Passengers: యూకే నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జనవరి 8 నుంచి 30 మధ్య ఆ దేశం నుంచి వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే పరీక్షలకు అయ్యే ఖర్చు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను శనివారం జారీ చేసింది కేంద్రం.
ఇదిలా ఉంటే.. బ్రిటన్ నుంచి విమాన రాకపోకలపై కేంద్రం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా, యూకేలో కొత్త స్ట్రైయిన్ వైరస్ బయటపడటంతో గత ఏడాది డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు కేంద్రం ఆ దేశం నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. తర్వాత ఆ ఆంక్షలను జనవరి 7వ తేదీ వరకు పొడిగించింది.