ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు… 20 మంది మృతి… పలువురికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పేలుడు కారణంగా మసీదు పైకప్పు పడిపోయిందని, ఇప్పటివరకు 20 మందికి పైగా చనిపోయినట్లు నంగార్హార్ ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అత్తౌల్లా […]

ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు... 20 మంది మృతి... పలువురికి గాయాలు

Updated on: Oct 18, 2019 | 6:38 PM

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పేలుడు కారణంగా మసీదు పైకప్పు పడిపోయిందని, ఇప్పటివరకు 20 మందికి పైగా చనిపోయినట్లు నంగార్హార్ ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అత్తౌల్లా ఖోగ్యాని తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో బలగాలను భారీగా మోహరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us