Jaish-E-Mohammed: జనవరి 18లోగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ను అరెస్టు చేయండి.. పాక్‌ కోర్టు ఆదేశాలు

|

Jan 10, 2021 | 5:54 AM

Jaish-E-Mohammed: జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను జనవరి 18వ తేదీలోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెర్రర్‌ ....

Jaish-E-Mohammed: జనవరి 18లోగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ను అరెస్టు చేయండి.. పాక్‌ కోర్టు ఆదేశాలు
Follow us on

Jaish-E-Mohammed: జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను జనవరి 18వ తేదీలోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న మసూద్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని గతంలో ఆదేశాలు కూడా వచ్చాయి. కాగా, అతన్ని శుక్రవారం కోర్టులో హాజరు పర్చాలని స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగాన్ని న్యాయమూర్తి నటాషా నసీమ్‌ సుప్రా ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రావాలా ఉగ్రవాద నిరధక కోర్టు అజాద్‌ అరెస్టు కోసం గురువారం వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 18లోగా అరెస్టు చేయాలని ఉగ్రవాద నిరోధక విభాగ పోలీసులను ఆదేశించింది.

కాగా, మసూద్‌ అజార్‌ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు కోర్టు ఆదేశాల ద్వారా తెలుస్తోంది. అతడి ఆచూకీ గురించి తమకు తెలియదని అధికారులు, ఆ దేశ నేతలు ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మసూద్‌ అజార్‌ పాత్ర ఉన్నట్లు ఆధారాలను భారత్‌ సమర్పించినా పాక్‌ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్ష జరుగనుండటం నేపథ్యంలోనే అతడి అరెస్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. హైదరాబాద్ మూలాలపై నిఘా వర్గాల ఆరా..!