చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం..

ఇప్పటికే జల ప్రళయంతో వణికిపోతున్న నేపాల్ వాసులకు మరో ప్రకృతి విపత్తు ఎదరైంది. నేపాల్- చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. చైనాలోని సిచూవాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు భయంతొ బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.1గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.

చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం..
China Earthquake News

Updated on: Aug 28, 2026 | 3:04 PM

చైనా- నేపాల్ సరిహద్దులో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో గల లాంగ్‌చాంగ్ నగరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకారం, ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:13 గంటల ప్రాంతంలో ప్రావిన్స్‌లో సంభవించింది. ఈ భూకంప కేంద్రం 29.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 105.22 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద.. భూమికి 13 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు పేర్కొంది.

అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లోని భవనాలు పగుళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణం నష్టం జరిగినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

అయితే ఈ భూకంపం సంభించిన ప్రాంతం నేపాల్ సరిహద్దులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జల ప్రలయంలో ఇబ్బంది పడుతున్న నేపాల్‌ వాసులను ఈ భూకంపం మరింత భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us