Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ

|

Jul 09, 2021 | 4:53 PM

ఢాకా ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జ్యూస్‌ ఫ్యాక్టరీ కాలిబూడింది. ఈ ఘటనలో సుమారు 52 మంది అగ్నికి ఆహుతయ్యారు. 50 మందికి తీవ్రగాయాలయ్యాయి..

Fire Accident: అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఢాకా.. 52 మంది సజీవ దహనం..కాలిబూడిదైన జ్యూస్‌ ఫ్యాక్టరీ
Bangladesh Fire Accident
Follow us on

బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జ్యూస్ ఫ్యాక్టరీలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 52 మంది కార్మికులు మరణించగా.. మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను తీసుకురావడానికి మొత్తం 18 ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

ముందుగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే భవనమంతా మంటలంటుకున్నాయి. కెమికల్స్‌, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ అక్కడే ఉండడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన ఫ్యాక్టరీలోని సిబ్బంది కొంతమంది భవనం పై నుంచి కిందకు దూకేశారు. కిందపడడంతో తీవ్రగాయాలపాలై చనిపోయారు. 18 అగ్నిమాపక వాహనాలతో మంటలార్పారు సిబ్బంది. అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో 44 మంది అదృశ్యమయ్యారు. కాలిన శవాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం అలుముకుంది. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఫ్యాక్టరీ ప్రాంతం దద్దరిల్లుతోంది.

అయితే, ఈ ప్రమాదానికి ఫ్యాక్టరీలో జరుగుతున్న వెల్డింగ్ వర్క్‌ నుంచి ఎగిసిన చిన్న నిప్పు రవ్వ ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఫ్యాక్టరీలో100 మందికిపైగా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై అక్కడి అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో అంతా మహిళ కార్మికులని సమాచారం.

ఇది కూడా చదవండి : L Ramana Resign: తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి మరో షాక్.. అధ్యక్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా..!