AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుడాన్‌లో గిరిజనుల మధ్య ఘర్షణ.. 37 మంది మృతి

సుడాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. బని అమెర్, నుబా గిరిజన జాతుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. అయితే గిరిజనుల మధ్య జరిగిన గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. అక్కడ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం సోవెరిన్ […]

సుడాన్‌లో గిరిజనుల మధ్య ఘర్షణ.. 37 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2019 | 9:42 PM

Share

సుడాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. బని అమెర్, నుబా గిరిజన జాతుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. అయితే గిరిజనుల మధ్య జరిగిన గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. అక్కడ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం సోవెరిన్ కౌన్సిల్‌ గవర్నర్ ను తొలగించింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి మిలటరీ, భద్రతాబలగాలను దింపింది.