
రుతుపవనాల రాకతో భారతదేశం మాత్రమే కాకుండా నేపాల్లోని అనేక ప్రాంతాలు వర్షాల కారణంగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయి. నదులు భయంకర రూపంతో ప్రవహిస్తున్నాయి. ఉప్పొంగిన వరదలతో చాలా చోట్ల జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. నేపాల్ -చైనా సరిహద్దులో కూడా రుతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. ఖాట్మండు నుండి 120 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
Early this morning: Nepal-China Border Flood Disaster. July 08, 2025
📍Rasuwagadi, 120 km north of Kathmandu.
18 people missing: 12 Nepali, 6 Chinese nationals
Friendship Bridge destroyed, halting all trade through the Rasuwagadi route
Dozens of trucks and hundreds of EVs… pic.twitter.com/kqHb9ZUjbQ
— Weather Monitor (@WeatherMonitors) July 8, 2025
నేపాల్-చైనా సరిహద్దులోని భోటేకోషి నదిలో నిన్న రాత్రి వరదల కారణంగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. ఈ వరదలో నేపాల్-చైనా మధ్య ఉన్న ఏకైక వాణిజ్య కేంద్రమైన రసువాగధిని కలిపే మైత్రి వంతెన కొట్టుకుపోయింది. నేపాల్ -చైనాలను కలిపే ప్రధాన వంతెన మైత్రి వంతెన. భోటెకోషి నదిపై నిర్మించబడిన ఈ వంతెన నేపాల్లోని రసువా జిల్లాను చైనాకు అనుసంధానిస్తుంది. అయితే, భారీ వర్షాల కారణంగా, భోటెకోషి నది వరదల్లో మునిగిపోయింది. నిన్న రాత్రి 3:15 గంటల ప్రాంతంలో ఈ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ వంతెన ద్వారా చైనా- నేపాల్ మధ్య ప్రతిరోజూ లక్షల రూపాయల విలువైన వ్యాపారం జరిగేది.
వీడియో ఇక్కడ చూడండి..
Nepal | Flash flood in Bhotekoshi River along the Nepal-China border sweeps the Miteri Bridge along with vehicles from the dry port.
“Many of the vehicles kept in the customs port along the Bhotekoshi River have been swept away by the flash flood after heavy rainfall on the…
— ANI (@ANI) July 8, 2025
ఈ వరదలో వస్తువులతో నిండిన డజన్ల కొద్దీ కంటైనర్లు కూడా కొట్టుకుపోయాయి. ఇది మాత్రమే కాదు, చైనా నుండి నేపాల్కు ఎగుమతి చేయబడిన వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సరిహద్దు వద్ద ఆగివున్న డజన్ల కొద్దీ ట్రక్కులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వరద కారణంగా నేపాల్ వైపు దాదాపు 16 మంది గల్లంతయ్యారని తెలిసింది. నేపాల్ సైన్యం ఉదయం నుండి సహాయ చర్యలలో నిమగ్నమై ఉంది. హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని రక్షించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.