పెను ప్రమాదంలో ఉన్నాం.. కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచం మొత్తం ప్రస్తుతం పెను ప్రమాదకర దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి హెచ్చరించింది. వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ ఆందోళన వ్యక్తం చేశారు.

పెను ప్రమాదంలో ఉన్నాం.. కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 3:46 PM

ప్రపంచం మొత్తం ప్రస్తుతం పెను ప్రమాదకర దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి హెచ్చరించింది. వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ”ప్రస్తుతం పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇళ్లలో ఉండటానికి ప్రజలు విసుగెత్తుతున్నారు. ఆర్థికంగా పుంజుకోవడం కోసం చాలా దేశాలు కార్యకలాపాలను ప్రారంభించాయి. అయితే వైరస్ వేగంగా విస్తరిస్తోంది” అని ఆయన అన్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు.

ఇక కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి.. అది అంత సులువైన ప్రయాణం కాదని అన్నారు. అవసరమైన విధంగా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకోవాలని.. వైరస్‌ వ్యాప్తి అవకాశాలను గుర్తించకపోతే అది విపరీతంగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87లక్షలను దాటేసింది. అలాగే మరణించిన వారి సంఖ్య 4 లక్షలను దాటేసింది. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలకు దగ్గరగా ఉండగా.. 12వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Read This Story Also: అందుకే ఆరు నెలల ముందుగానే నేతన్నలకు సాయం: సీఎం జగన్