నలుగురు బందీల కోసం.. 274 మంది గాజా వాసుల ప్రాణాలు తీశారు

|

Jun 12, 2024 | 12:02 PM

సెంట్రల్‌ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ తాజాగా చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్‌ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్‌-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

సెంట్రల్‌ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ తాజాగా చేపట్టిన ఆపరేషన్‌లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్‌లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్‌ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్‌-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్‌ గాజాలోని నుసీరాత్‌ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్‌ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్‌ ప్రత్యేక దళాలు రక్షించాయి. అయితే ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం సంభవించడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం

సౌర తుపానుల‌ను చిత్రీక‌రించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు

బిగ్ బాస్‌8లోకి బ్యూటిఫుల్ పాపలు.. ఈ సారి ఇక రచ్చో రచ్చ

ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు

Follow us on