ఇరాన్‌లో నిరసన కారులను అణచివేస్తున్న ప్రభుత్వం వీడియో

Updated on: Jan 15, 2026 | 4:35 PM

ఇరాన్‌లో ప్రభుత్వం నిరసనకారులను అణచివేస్తోంది. మృతుల సంఖ్య 538కి పెరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100కి పైగా నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. 10,600 మందిని అరెస్ట్ చేశారు. ఇరాన్ పరిణామాలపై ట్రంప్, రెజా పహ్లావీ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌లో ప్రభుత్వం నిరసన కారులను తీవ్రంగా అణచివేస్తోంది. ఈ అణచివేతలో మరణించిన వారి సంఖ్య 538కి పెరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం కావడంతో యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఇస్లామిక్ పాలకులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 10,600 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. తమ ప్రభుత్వంతో పాటు తమ మిలిటరీ ఇరాన్‌లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ

Follow Us