దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..

|

Sep 14, 2024 | 1:03 PM

విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించిన దుబాయ్ యువరాణి .. తాజాగా మరో పోస్టు చేశారు. సొంత బ్రాండ్‌ కింద పెర్ఫ్యూ‌మ్‌ను ఆవిష్కరించారు. దానికి ఆమె పెట్టిన పేరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాను ‘డైవర్స్’ పేరిట ఓకొత్త పెర్‌ఫ్యూమ్‌ను తీసుకొస్తున్నట్లు యువరాణి షేక్ మహ్రా ఇన్‌స్టాగ్రాం వేదికగా ప్రకటించారు. సొంత బ్రాండ్‌ ‘మహ్రా ఎమ్‌1’ కింద దానిని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆ దృశ్యాలను షేర్ చేశారు.

విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించిన దుబాయ్ యువరాణి .. తాజాగా మరో పోస్టు చేశారు. సొంత బ్రాండ్‌ కింద పెర్ఫ్యూ‌మ్‌ను ఆవిష్కరించారు. దానికి ఆమె పెట్టిన పేరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాను ‘డైవర్స్’ పేరిట ఓకొత్త పెర్‌ఫ్యూమ్‌ను తీసుకొస్తున్నట్లు యువరాణి షేక్ మహ్రా ఇన్‌స్టాగ్రాం వేదికగా ప్రకటించారు. సొంత బ్రాండ్‌ ‘మహ్రా ఎమ్‌1’ కింద దానిని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆ దృశ్యాలను షేర్ చేశారు. అయితే పెర్‌ఫ్యూమ్ విలువ ఎంతో తెలియాల్సి ఉంది. కాగా, ఆమె కొన్ని నెలల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కుమార్తె షేక్‌ మహ్రా. బ్రిటన్‌లో ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనాబిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో మే 27, 2023న వీరి వివాహం జరిగింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Froze Food: ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ ను ఎలా వండుకోవాలి ??

చిన్న మెకానిక్‌.. పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి

దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట

Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..

Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్‌.. బిగ్ అప్డేట్‌ !!

Follow us on