చైనా ఆయిల్ ట్యాంకర్పై 5 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం
ఎర్ర సముద్రంలో చైనా, రష్యా వాణిజ్యనౌకలపై దాడి చేయబోమని హామీ ఇచ్చిన హౌతీ తిరుగుబాటుదారుల మాట తప్పారు. తాజాగా చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్పై ఐదు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ధ్రువీకరించాయి. దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు.
ఎర్ర సముద్రంలో చైనా, రష్యా వాణిజ్యనౌకలపై దాడి చేయబోమని హామీ ఇచ్చిన హౌతీ తిరుగుబాటుదారుల మాట తప్పారు. తాజాగా చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్పై ఐదు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ధ్రువీకరించాయి. దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. మార్చి 23న ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ఎంవీ హువాంగ్ పు నౌకపై యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారనీ అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఓడ పనామా పతాకంతో ప్రయాణిస్తోందనీ ఇది చైనాకు చెందిన సంస్థ ఆయిల్ ట్యాంకర్ అని తెలిపింది. సాయంత్రం 4.25 గంటల సమయంలో ప్రమాదంలో ఉన్నట్లు ఇది సంకేతాలు పంపిందనీ ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించిందని ప్రకటించింది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. యెమెన్ నౌకాశ్రయం మోఖా నుంచి 23 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు
లాకప్లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

