రేడియో .. డిజిటల్ యుగంలోనూ ఉనికిని చాటుతూ..
సోషల్ మీడియా, టెలివిజన్, స్మార్ట్ఫోన్ల యుగంలోనూ రేడియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ మాధ్యమం ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది. 'రేడియో, కృత్రిమ మేధస్సు' అనే ఈ ఏడాది థీమ్.. సంప్రదాయ ప్రసార మాధ్యమానికి, ఆధునిక సాంకేతికతకు మధ్య మారుతున్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.
తరతరాలుగా సమాచారం, విద్య, వినోదాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమంగా రేడియో నిలిచింది. ఉదయాన్నే భక్తి గీతాల నుంచి వార్తా బులెటిన్లు, ఇంటరాక్టివ్ కార్యక్రమాల వరకు దేశంలోని ప్రతి ఇంట్లో ఇది ఒక నమ్మకమైన నేస్తంగా కొనసాగుతోంది. నేటికీ చిన్న చిన్న దుకాణాలు, ఆటోరిక్షాలు, పెట్రోల్ పంపులలో రేడియో శబ్దం వినిపిస్తూనే ఉండటం సమాజంలో దానికున్న ఆదరణకు నిదర్శనం. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్ వంటి కీలక సమాచారాన్ని అందించడంలో రేడియో విశ్వసనీయతను చాటుకుంటోంది.రేడియోకు మళ్లీ ప్రాచుర్యం కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం రేడియోను మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
'వయసు' పెరిగింది.. 'మనసు' మారింది!
నరహంతక బంటి..ఎట్టకేలకు చిక్కింది
వైద్యసిబ్బంది నిర్లక్ష్యం..ఆరేళ్ల పసిప్రాణం బలి!
వ్యూస్ కోసం డెవిల్ క్రాబ్ తిని మృత్యువాత
విదేశాల్లో మాదిరిగా ముంబైలో మ్యూజికల్ రోడ్డు
అనుమానాస్పద ట్రాక్టర్.. చెక్చేయగా.. మైండ్ బ్లాక్
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

