తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. గత ఐదారు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత చలి నమోదైందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర భారత్ నుంచి వీస్తున్న శీతల గాలులు, తక్కువ తేమ, మేఘాలు లేకపోవడం దీనికి కారణాలని వివరించారు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయి ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి వంటి పశ్చిమ తెలంగాణ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట వంటి మధ్య తెలంగాణ జిల్లాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పటాన్చెరు, రాజేంద్రనగర్ వంటి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gudivada Amarnath: చంద్రబాబు పై కేసీఆర్ వ్యాఖ్యలు వంద శాతం నిజమే
Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
Published on: Dec 22, 2025 07:44 PM
