రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..

|

Sep 25, 2023 | 7:45 PM

డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ లను టీవీల్లో చూసే ఉంటారు. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం.. కదిలే రైలులో కళ్లముందే ప్రత్యక్షంగా కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్ లోని ఓ బుల్లెట్ రైలులో ఇద్దరు రెజ్లర్లు ఇలానే పోటీపడ్డారు. టోక్యోకు చెందిన డీడీటీ ప్రో రెజ్లింగ్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 75 మంది ప్రయాణికులు దీన్ని వీక్షించారు. మినోరు సుజుకి, సన్షిరో తకాజి మధ్య జరిగిన మల్లయుద్ధం పోటీని రైలులో చూసేందుకు ఉద్దేశించిన టికెట్లు అన్నీ కూడా 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి.

డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ లను టీవీల్లో చూసే ఉంటారు. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం.. కదిలే రైలులో కళ్లముందే ప్రత్యక్షంగా కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్ లోని ఓ బుల్లెట్ రైలులో ఇద్దరు రెజ్లర్లు ఇలానే పోటీపడ్డారు. టోక్యోకు చెందిన డీడీటీ ప్రో రెజ్లింగ్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 75 మంది ప్రయాణికులు దీన్ని వీక్షించారు. మినోరు సుజుకి, సన్షిరో తకాజి మధ్య జరిగిన మల్లయుద్ధం పోటీని రైలులో చూసేందుకు ఉద్దేశించిన టికెట్లు అన్నీ కూడా 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. టోక్యో నుంచి షింకషేన్ వరకు ప్రయాణించే రైలులో తాజాగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫైట్ కు సంబంధించి వీడియో క్లిప్ ట్వట్టర్ లోకి చేరింది. సుజుకి, తకాజి పోటీ పడుతుంటే చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా చూస్తూ, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించడం కనిపించింది. ఇలా అరగంట పాటు మ్యాచ్ కొనసాగింది. రెజ్లింగ్ అనేది జపాన్ లో ప్రాచుర్యం పొందిన ఆటల్లో ఒకటిగా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడ్డోడి కుకింగ్‌ పాన్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!

ఓ గోడౌన్‌లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!

ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా

టివీ చూస్తున్నతండ్రి.. పెగ్‌ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

 

Follow us on