మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??

|

Sep 01, 2023 | 10:24 AM

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న మహిళ కాలుకి ఎక్కడ్నంచి వచ్చిందో ఓ నాగుపాము చుట్టేసింది. భయంతో ఇంట్లోనివారంతా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు స్నేక్‌ క్యాచర్‌ను పట్టుకొని వచ్చి పామును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హమీర్‌పూర్‌ జిల్లా దేవిగంజ్‌ గ్రామానికి చెందిన మిథిలేష్‌ కుమారి యాదవ్‌ రాఖీపండగకోసం, సంగం సదర్ తహసీల్‌లోని దహ్రా గ్రామంలో తన పుట్టింటికి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న మహిళ కాలుకి ఎక్కడ్నంచి వచ్చిందో ఓ నాగుపాము చుట్టేసింది. భయంతో ఇంట్లోనివారంతా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు స్నేక్‌ క్యాచర్‌ను పట్టుకొని వచ్చి పామును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హమీర్‌పూర్‌ జిల్లా దేవిగంజ్‌ గ్రామానికి చెందిన మిథిలేష్‌ కుమారి యాదవ్‌ రాఖీపండగకోసం, సంగం సదర్ తహసీల్‌లోని దహ్రా గ్రామంలో తన పుట్టింటికి వచ్చింది. ఆ మహిళ నిద్రపోతున్న సమయంలో ఆమె కాలుకి ఓ నాగుపాము చుట్టుకుని పడగవిప్పి చూస్తోంది. అది గమనించిన మిథిలేష్‌ భయంతో వణికి పోయింది. అయితే ధైర్యం కూడగట్టుకొని ఆమె కదలకుండా అలానే మంచంపైన కూర్చుని కాలుని కదపకుండా తన ఇష్టదైవం శివుణ్ణి ప్రార్ధించడం మొదలు పెట్టింది. ఇంతలో కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు, స్నేక్‌ క్యాచర్‌ అక్కడికి చేరుకున్నారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ ఆ పాము బెదిరిపోకుండా, మహిళకు ఎలాంటి హానీ కలగకుండా పామును బంధించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్‌.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి

చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు

TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది

Tiger Nageswara Rao: టైగర్ నాగశ్వరరావుకు ఝలక్‌.. హైకోర్ట్ సీరియస్

Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ

 

Follow us on