గేదెల కోసం రెండో పెళ్లికి సిద్ధమైన మహిళ.. చివరకు అత్తమామల ఎంట్రీతో..

Updated on: Feb 28, 2025 | 1:28 PM

కొన్ని వివాహాల గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఓ ఆశ్చర్యకర వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ గేదెల కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే చివరకు అత్తమామల ఎంట్రీతో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని హసన్‌పూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 300 జంటలకు సామూహిక వివాహాలను నిర్వహించారు.

ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు 35,000 రూపాయల బహుమతి అందించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంటపంలోకి వచ్చిన ఓ వృద్ధ జంట.. వధూవరుల వద్దకు వచ్చింది. వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అయింది. తమ కోడలు తమ కొడుక్కు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటోందంటూ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ జంటను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. ఆమె నూర్ మొహమ్మద్ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే తర్వాత కుటుంబ సమస్యల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై సంతోషంతో ఫోటోలకు ఫోజులిచ్చిన వరుడు.. ఇంతలో

బాబోయ్.. నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయి

మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్‌ ఐబ్రోస్‌, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు

రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??

నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్‌ !!