AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru: హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

Eluru: హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

Anil kumar poka
|

Updated on: Nov 02, 2024 | 7:23 PM

Share

ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ఎంతో విజ్ఞానంతో పాటు అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అనేది అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఎన్నో వింతలు, మరెన్నో మహిమలు భక్తులను భక్తి పారవశ్యంలో కట్టిపడేస్తాయి. ఏలూరు జిల్లా కలిదిండిలోని అతి ప్రాచీన పాతాళ భోగేశ్వరస్వామి ఆలయం కూడా ఆ కోవకు చెందినదే. ఇక్కడ శివుడు లింగాకారంలో స్వయంభుగా కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు ఉంది. ఆ కోనేరులో పంచబుగ్గలు ఉన్నాయి. భక్తులు స్వామిని దర్శించిన అనంతరం కోనేరు వద్దకు వెళ్లి హరహర అంటే చాలు ఓ వింత సాక్షాత్కరిస్తుంది. భక్తులు కోనేరు వద్ద హరహర అనగానే పంచ బుగ్గల నుంచి నీరు బుడబుడా అని శబ్దం చేస్తూ పైకి వస్తాయి. ఆ వింతను భోగేశ్వర స్వామి మహిమగా భక్తులు కీర్తిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈ ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో నిర్మించారు. వేంగిరాజు రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతుంది. రాజ రాజ చోళుడు కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలందున్నుతుండగా భూమిలో నాగలి కర్రుకు లింగాకారంలో ఉన్న శిల కనిపించింది. కొంత భాగం అది విరిగి అక్కడి నుండి రక్తం వరదలా పారింది. దీంతో ఆ పరమశివుడే అక్కడ స్వయంభుగా కొలువయ్యాడని నమ్మిన స్థానికులు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి విరిగిన భాగాన్ని అతికించినట్టుగా చెబుతారు. ఇప్పటికీ లింగాకారంలో కొంత భాగం ఒక పక్క విరిగినట్లుగా, దానిని తిరిగి అతికించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాక అతికించిన భాగం నుంచి చమరిస్తున్నట్లుగా భక్తులకు కనిపిస్తుంది.

ఈ ఆలయం కలిదిండికి 3 మైళ్ళ దూరంలో పొలాల మధ్య ఏకాంతంగా ఉంటుంది. ఆలయ ధ్వజస్తంభంపై స్వామివారి పాదాలు కూడా భక్తులకు కనిపిస్తాయి. పూర్వం వర్షాకాలంలో జోరున వర్షం కురుస్తుండటంతో స్వామివారి నిత్యార్చనకు ఆలస్యం అవడంతో స్వామివారు ధ్వజస్థంభం ఎక్కి చూచి అర్చకుల రాకను గమనించి ధ్వజస్థంభంపై నుండి దూకటంతో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడినట్లు ఆలయ స్థల పురాణంలో చెబుతుంది. నేటికి కూడా ఆ పాద గుర్తులు భక్తులు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఏటా మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకూ శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి వారికి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.