వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన నగల పర్సు వీడియో
ఆలయానికి వెళ్ళిన ఒక కుటుంబం దగ్గరున్న 20 లక్షలు విలువ చేసిన నగలు పర్సును కోతి కొట్టేసిందట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తీవ్రగాలిపు చర్యలు చేపట్టిన పోలీసులు సిసిటివి ఫుటేజ్ ను జల్లడి పెట్టారు. అనంతరం పర్సును గుర్తించి బాధితులకు అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బాంకి బిహారి ఆలయానికి అలీ గార్కు చెందిన అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి వచ్చాడు. గుడిలోకి వెళ్తున్న సమయంలో దొంగలుంటారనే భయంతో అభిషేక్ భార్య తన 20 లక్షల రూపాయల విలువైన నగలను తీసి పర్సులో పెట్టుకున్నారు. వారు గుడి నుంచి తిరిగి వస్తుండగా బయట ఉన్న ఒక కోతి వారి దగ్గరున్న 20 లక్షలు విలువ చేసిన నగలు ఉన్న పర్సును లాక్కొని ఇరుకైన సందులగుండా పారిపోయింది. ఎంత వెతికినప్పటికీ లాభం లేకపోవడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ సహాయంతో తీవ్ర గాలిపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత కోతి పర్సును చెట్టు పొదల్లో పడేసి వెళ్లడంతో దాన్ని తీసుకొని అభిషేక్ కు అప్పగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

