భార్య అనుష్కతో కలిసి అక్కడ 8 ఎకరాలు కొన్న కోహ్లి !! ధర ఎంతంటే ??

|

Sep 07, 2022 | 8:51 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు సమాచారం.

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు సమాచారం. భార్య అనుష్క శర్మతో కలిసి దాదాపుగా ఎనిమిది ఎకరాల భూమిని అతడు కొన్నట్లు తెలుస్తోంది. మలయాళ మనోరమ కథనం ప్రకారం.. కోహ్లి, అనుష్క ఆర్నెల్ల క్రితమే డీల్‌ కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం పందొమ్మిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. ఇక కోహ్లి దంపతులు 1.15 కోట్ల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. కోహ్లి ఇప్పటికే ‘వన్‌8’ బ్రాండ్‌ పేరిట క్లాత్‌, షూస్‌, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ముంబైలో గల.. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ కిషోర్‌ కుమార్‌కు చెందిన బంగ్లాలో కోహ్లి తన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా అధ్యక్షుడి కూతురి ఫొటో లీక్‌ చేశాడు.. చుక్కలు చూస్తున్నాడు

ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు

వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..

ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!

 

Follow us on