AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువు.. లాక్కెళ్లిన తోడేలు

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువు.. లాక్కెళ్లిన తోడేలు

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 12:35 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిద్రపోతున్న చిన్నారులను తోడేళ్లు ఎత్తుకుపోతున్నాయి. ఇప్పటికే 8 మంది చిన్నారులు, ఒక వృద్ధుడు మరణించగా, 32 మంది గాయపడ్డారు. గ్రామస్థులు భయాందోళనలో ఉండగా, సీఎం ఆదేశాల మేరకు తోడేళ్లను కాల్చివేసే చర్యలు కొనసాగుతున్నాయి. అటవీ శాఖ, షూటర్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తల్లిని అంటిపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆ రాత్రి కాళరాత్రయింది. శనివారం అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు చిన్నారిని నోట కరుచుకుని అడవిలోకి పరుగుతీసింది. అలికిడికి లేచిన తల్లి గగ్గోలుపెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్‌ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి. శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా అటవీ ప్రాంత గ్రామాలలో గతేడాది సీన్‌ రిపీటైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు గ్రామస్లుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కిరణ్‌ సంతోష్‌ దంపతుల నాలుగు నెలల సుభాష్‌ జాడ తెలియలేదు. ఈ గ్రామంలో 9 రోజుల వ్యవధిలో జరిగిన మూడో ఘటన ఇది. మూడు నెలలుగా అంటే సెప్టెంబర్‌ నుంచి బహ్రెయిచ్‌ జిల్లా గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్ల సమూహం దాడులు నమోదయ్యాయి. ఇప్పటివరకు యూపీ గ్రామాలలో తోడేళ్ల సమూహం 8 మంది చిన్నారులతో పాటు ఓ వృద్ధుడిని పొట్టనబెట్టుకున్నాయి. వీటి దాడుల్లో 32 మంది గాయపడ్డారు. సీఎం యోగి ఆదేశాలతో షూటర్లు ఇటీవల నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు. మరికొన్నిటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు తీసుకున్న అన్మోల్ అంబానీ

భారత్ లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర

CM Revanth Reddy: కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు..

కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..