Watch Video: కెమెరాలో చిక్కిన పులుల మధ్య భీకర పోరు.. చివరకు విషాదాంతం..!
మహారాష్ట్రలోని చంద్రాపూర్లోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్లో రెండు పులుల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పులల సంరక్షణ కోసం అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అయితే పులులు పరస్పరం తలపడి, ఒకటి ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు పులల మధ్య జరిగిన భీకర పోరులో ఓ పులి మృతి చెందింది. చంద్రాపూర్లోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఛోటా మట్కా, బజరంగ్ అనే రెండు పులులు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. కొన్ని గంటల పాటు సాగిన పోరులో బజరంగ్ అనే పులి మరణించింది. రెండూ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ఆ ప్రాంతం భీకర శబ్ధంతో దద్దరిల్లిపోయిందని సమీపంలోని గ్రామస్థులు తెలిపారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఆధిపత్యం చాటుకోవడం కోసం ఆ రెండింటి మధ్య పోరు జరిగినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
తీవ్ర గాయాలతో చనిపోయిన బజరంగ్ మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పులల సంరక్షణ కోసం అటవీ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అయితే పులులు పరస్పరం తలపడి, ఒకటి ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

