వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్.. అంతలోనే పని కానిచ్చేశారు..
వేసిన తలుపు వేసినట్లుగానే ఉంది. వేసిన తాళం కూడా వేసినట్లుగానే ఉంది. కానీ లోపల క్యాష్ కౌంటర్లో ఉండాల్సిన నగదు మాత్రం మాయమైంది.
వేసిన తలుపు వేసినట్లుగానే ఉంది. వేసిన తాళం కూడా వేసినట్లుగానే ఉంది. కానీ లోపల క్యాష్ కౌంటర్లో ఉండాల్సిన నగదు మాత్రం మాయమైంది. దీంతో ఆశ్చర్యపోవడం బార్ నిర్వాహకులు వంతైంది. చివరికి సిసి కెమెరా విజువల్స్ పరిశిలిస్తే ఇదంతా దొంగ పని అని తేలింది. ఇంకేముంది బార్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. సత్తెనపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విజేత బార్ అండ్ రెస్టారెంట్ను ఎప్పటిలాగే నిర్వాహకులు రాత్రి తాళం వేసి వెళ్లిపోయారు. మరుసటిరోజు ఉదయం వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లారు. అయితే లోపల క్యాష్ కౌంటర్ తీసి ఉండటం అందులో ఉండాల్సిన నగదు లేకపోవటంతో ఆశ్చర్యపోయారు. వేసిన తాళాలు వేసినట్లుండగానే చోరి ఎలా జరిగిందో అర్థం కాలేదు. సిసి కెమెరాలను పరిశీలించిన నిర్వాహకులకు షాపు మూయటానికి ముందే లోపల ఒక వ్యక్తి నక్కి ఉన్నట్లు గుర్తించారు. షాపు మూసిన తర్వాత కౌంటర్ ఓపెన్ చేసి నగదు తీసుకున్నాడు. అనంతరం షాపుకున్న కిటికీ తీసి పరారయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వద్ద డ్యాన్స్.. ఇంతలో !!
పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్
టేబుల్ స్పూన్తో హెయిర్ కట్.. షాకవుతున్న నెటిజన్లు
చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!
మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

