Shocking Video: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి..! షాక్‌ తిన్న వైద్యులు..! వైరల్ అవుతున్న వీడియో..

చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఓ వ్యక్తి. స్పెయిన్‌లో జరిగింది ఈ సంఘటన. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తలరించారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు.

Shocking Video: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి..! షాక్‌ తిన్న వైద్యులు..! వైరల్ అవుతున్న వీడియో..

|

Updated on: Feb 16, 2022 | 6:47 PM


చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఓ వ్యక్తి. స్పెయిన్‌లో జరిగింది ఈ సంఘటన. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తలరించారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ఆ ఖైదీ చనిపోయిన విషయాన్ని అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు. అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు నివేదికలో తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి పోస్ట్‌ మార్టం చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్‌ గుర్తులు కూడా ఉన్నాయి. కానీ ఇంతలో ఆ వ్యక్తి వింతగా అరుస్తూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా మేల్కొన్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. దాంతో ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Follow us